శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో శనివారం మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. 15 రోజుల క్రితం లాక్డౌన్ నిబంధనలో భాగంగా మద్యం దుకాణాలు పూర్తిస్థాయిలో మూసివేశారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దుకాణాలను నిర్వహిస్తున్నారు.
పాతపట్నంలో తెరుచుకున్న మద్యం దుకాణాలు
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దుకాణాలను నిర్వహిస్తున్నారు.
పాతపట్నంలో తెరుచుకున్న మద్యం దుకాణాలు
తొలిరోజు కావడంతో పాతపట్నంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. నేటి నుంచి దుకాణాలు యధావిధిగా తెరుచుకుంటాయని ఎక్సైజ్ ఎస్సై దొరబాబు తెలిపారు.