శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వెంకయ్యపేటలో ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులతో కలసి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు వినూత్న పంథాలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 1500 మందికి ఫేస్ మాస్కులు, శానిటైజర్లు అందజేస్తూ అవగాహన కల్పించారు. చేతులు ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, ఏ విధంగా భౌతికదూరం పాటించాలి అనే అంశంపై విద్యార్థులు అవగాహన కల్పించారు. లాక్ డౌన్ ముగిసిన తరువాత కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు, సూచనలు ఇచ్చారు.
విద్యార్థులతో కలిసి కరోనా వైరస్పై అవగాహన
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మున్సిపాలిటీలోని వెంకయ్యపేటలో... ప్రభుత్వ జూనియర్ కళాశాల యాజమాన్యం విద్యార్థులతో కలిసి కరోనాపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రజలకు మాస్కులు పంచి సూచనలు చేశారు.
awrness programm on corona virus in srikakulam dst amdalavalasa