శ్రీకాకుళం ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సభ్యులు... సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి.. రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలన్నారు.
బడ్జెట్లో ఐసీడీఎస్కు నిధులు పెంచాలని వారు డిమాండ్ చేశారు. అప్రజాస్వామికంగా ఐసీడీఎస్ను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డ కార్యకర్తలు.. పెన్షన్తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్, అమ్మఒడి, ఇళ్ళస్థలాలు, సంక్షేమ పధకాలు అమలు చేయాలని కోరారు.