ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 28, 2021, 2:14 PM IST

ETV Bharat / state

శ్రీకాకుళంలో అంగన్​వాడీ కార్యకర్తల ధర్నా

ఐసీడీఎస్‌కు బడ్జెట్‌లో నిధులు పెంచాలని అంగన్​వాడి కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

శ్రీకాకుళంలో అంగన్​వాడీ కార్యకర్తల ధర్నా
శ్రీకాకుళంలో అంగన్​వాడీ కార్యకర్తల ధర్నా

శ్రీకాకుళం ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్‌ హెల్పర్స్ యూనియన్ సభ్యులు... సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి.. రిటైర్‌మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలన్నారు.

బడ్జెట్​లో ఐసీడీఎస్​కు నిధులు పెంచాలని వారు డిమాండ్ చేశారు. అప్రజాస్వామికంగా ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డ కార్యకర్తలు.. పెన్షన్‌తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్, అమ్మఒడి, ఇళ్ళస్థలాలు, సంక్షేమ పధకాలు అమలు చేయాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details