ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాంట్రాక్టర్ అవినీతితో... ప్రజలకు నీటి ఎద్దడి!

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడులో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సమస్య పరిష్కరించాలంటూ రోడ్డుపై బైఠాయించారు.

By

Published : Apr 18, 2019, 9:30 AM IST

కాంట్రాక్టర్ అవినీతితో... ప్రజలకు నీటి ఎద్దడి

కాంట్రాక్టర్ అవినీతితో... ప్రజలకు నీటి ఎద్దడి

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడులో తాగునీటి సమస్యతో ప్రజలు పోరుబాట పట్టారు. ట్యాంకర్లతో నీటిని తోలుతున్న కాంట్రాక్టర్... బోర్లకు వినియోగించే కరెంటును అక్రమంగా తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ ప్రభావం.. గ్రామస్తులపై పడింది. విద్యుత్ సదుపాయం లేక.. ట్యాంకర్లతో నీటి సరఫరాకు అడ్డంకిగా మారింది. సమస్య తీవ్రమైన పరిస్థితుల్లో... బాధితులు మంచినీటి కోసం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details