ప్రకాశం జిల్లా కనిగిరిలో దాతల సహాయంతో స్థానిక ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్, డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతున్నందున ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమవ్వాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు.
పోలీస్ సిబ్బందికి బియ్యం, నిత్యావసరాల అందజేత
లాక్డౌన్ పరిస్థితుల్లో అత్యవసర సేవలందిస్తున్న పోలీసు సిబ్బందికి ప్రకాశం జిల్లా కనిగిరిలో స్థానిక ఎమ్మెల్యే బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అత్యవసర సేవలందిస్తున్న పోలీసు సిబ్బంది కృషి అనిర్వచనీయమని కొనియాడారు.
పోలీస్ సిబ్బందికి బియ్యం, నిత్యావసరాల అందజేత