ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దళిత ఎమ్మెల్యేకు ఇచ్చిన గౌరవం ఇదేనా: డొక్కా

కొండెపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిని పోలీసులు అడ్డుకున్న ఘటనపై ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. ఈ విషయంపై సీఎం జగన్మోహన్ రెడ్డి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.

By

Published : Jul 8, 2019, 6:05 PM IST

Published : Jul 8, 2019, 6:05 PM IST

కొండెపి ఎమ్మెల్యేను పోలీసులే అడ్డుకోవటం దారుణం

ప్రకాశం జిల్లాకొండెపి ఎమ్మెల్యేని అధికారిక కార్యక్రమంలో అడ్డుకోవటాన్ని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తీవ్రంగా ఖండించారు.దళిత ఎమ్మెల్యే పట్ల ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించటం తగదన్నారు.ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితులు మంచిది కాదన్న ఆయన...అధికారిక విధులు నిర్వహించకుండా ఒక ఎమ్మెల్యేని పోలీసులే అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు.దీనిపైముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ డొక్కా డిమాండ్‌చేశారు.

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్

ABOUT THE AUTHOR

...view details