జమ్మూలో తుపాకీ మిస్ ఫైర్.. ప్రకాశం వాసి మృతి
ఆర్మీలో విధులు నిర్వరిస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన అశోక్ కుమార్ అనే జవాన్ మృతి చెందారు. జమ్మూలో పని చేస్తున్న అతను తుపాకీ మిస్ ఫైర్ కావటంతో మృత్యువాత పడ్డారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఆర్మీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్మీలో విధులు నిర్వర్తిస్తున్న తమ్మినేని అశోక్ కుమార్ జమ్మూలో తుపాకీ మిస్ ఫైర్ అవ్వటం వల్ల మృతి చెందారు. తల్లిదండ్రులు తెలిపిన సమాచారం మేరకు రెండు సంవత్సరాల క్రితం ఆర్మీ విధుల్లో జాయిన్ అయినట్లు తెలిపారు. మృతుడి అన్న కూడా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. అశోక్ కుమార్ మృతదేహాన్ని స్వగ్రామమైన పాపినేనిపల్లి గ్రామానికి తరలించేందుకు ఆర్మీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.