ప్రకాశం జిల్లా దెందులూరు మండలం సింగవరం కూడలిలో గుండుగోలను గ్రామానికి చెందిన దాట్ల సీతారామరాజు 800 మంది వలస కూలీలకు ఆహార పొట్లాలను అందజేశారు. హైదరాబాద్, చెన్నై, ఒంగోలు, ప్రకాశం తదితర ప్రాంతాల నుంచి బస్సులు, లారీలలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఝార్ఖండ్, బిహర్ తదితర రాష్ట్రాలకు వెళ్తున్న వలస కూలీలకు భోజనం ప్యాకెట్లు అందజేశారు. జాతీయ రహదారిపై వెళ్తున్న వలస కూలీలకు వీటిని అందజేయడంలో స్థానికులు సహకారం అందించారు.