ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రకాశం జిల్లాలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, దర్శిలో ఘనంగా నిర్వహించారు. వైకాపా నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

By

Published : Nov 1, 2020, 4:03 PM IST

Published : Nov 1, 2020, 4:03 PM IST

andhra pradesh state formation day celebrations in prakasam district
ప్రకాశం జిల్లాలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం


ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక వైకాపా నాయకుల ఆధ్వర్యంలో ప్రధాన కూడలిలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పులా మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకుని నివాళులర్పించారు.

దర్శిలో...

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దర్శిలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. దర్శి మున్సిపల్ ఇంచార్జి కమిషనర్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు, గాంధీజీ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అమరవీరులకు జోహారులు పలుకుతూ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఇదీ చదవండి:

చిత్రావతీ.. ఇదేం గతి?... గూడు లేదు.. పరిహారం లేదు.. బతికేదెలా?

ABOUT THE AUTHOR

...view details