ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు: దర్శి డీఎస్పీ

ప్రకాశం జిల్లా కూకట్లపల్లి గ్రామంలో జరిగిన వివాహిత హత్య కేసును అద్దంకి పోలీసులు ఛేదించారు. భర్తే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు దర్శి డీఎస్పీ ప్రకాశ్ రావు తెలిపారు.

By

Published : Oct 16, 2020, 8:57 PM IST

Updated : Oct 16, 2020, 9:26 PM IST

addanki police cracked the married woman suspicious death cases in Prakasam
భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రికరించాడు: దర్శి డీఎస్పీ

ఈ నెల 10వ తేదీన ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కూకట్లపల్లి గ్రామంలో జరిగిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను దర్శి డీఎస్పీ ప్రకాశ్ రావు వెల్లడించారు. కూకట్లపల్లి గ్రామానికి చెందిన వేల్పుల మరీదాసుకి రాణితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగిందని, నెల రోజుల క్రితమే రాణి బిడ్డకు జన్మనిచ్చిందని డీఎస్పీ తెలిపారు.. భార్యభర్తల మధ్య కుటుంబ తగాదాల నేపథ్యంలో మరీదాసు.. భార్యతో గొడవ పడ్డాడని, ఈ క్రమంలో ఆమె గొంతునులిమి చంపినట్లు విచారణలో తెలిందని డీఎస్పీ వెల్లడించారు.

నిందితునికి హైదరాబాద్​కు చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై జరిగిన గొడవ ఆ దారుణానికి దారి తీసిందని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును త్వరితగిత ఛేదించిన అద్దంకి సీఐ ఆంజనేయ రెడ్డి, ఎస్సై శివ నాంచారయ్య, పోలీస్ సిబ్బందిని ఎస్పీ తరఫున ఆయన అభినందించారు.

Last Updated : Oct 16, 2020, 9:26 PM IST

ABOUT THE AUTHOR

...view details