ఈ నెల 10వ తేదీన ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కూకట్లపల్లి గ్రామంలో జరిగిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను దర్శి డీఎస్పీ ప్రకాశ్ రావు వెల్లడించారు. కూకట్లపల్లి గ్రామానికి చెందిన వేల్పుల మరీదాసుకి రాణితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగిందని, నెల రోజుల క్రితమే రాణి బిడ్డకు జన్మనిచ్చిందని డీఎస్పీ తెలిపారు.. భార్యభర్తల మధ్య కుటుంబ తగాదాల నేపథ్యంలో మరీదాసు.. భార్యతో గొడవ పడ్డాడని, ఈ క్రమంలో ఆమె గొంతునులిమి చంపినట్లు విచారణలో తెలిందని డీఎస్పీ వెల్లడించారు.
నిందితునికి హైదరాబాద్కు చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై జరిగిన గొడవ ఆ దారుణానికి దారి తీసిందని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును త్వరితగిత ఛేదించిన అద్దంకి సీఐ ఆంజనేయ రెడ్డి, ఎస్సై శివ నాంచారయ్య, పోలీస్ సిబ్బందిని ఎస్పీ తరఫున ఆయన అభినందించారు.