ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనాతో ప్రాణాలు పోతుంటే మద్యం దుకాణాలు తెరుస్తారా..?'

ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవటంపై నెల్లూరు జిల్లాలో మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కరోనా వ్యాప్తికి కారణమవుతున్న మద్యం దుకాణాలను వెంటనే మూసేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

By

Published : May 5, 2020, 7:44 PM IST

'కరోనాతో ప్రాణాలు పోతుంటే మద్యం దుకాణాలు తెరుస్తారా?'
'కరోనాతో ప్రాణాలు పోతుంటే మద్యం దుకాణాలు తెరుస్తారా?'

కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే... ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవటమేంటని నెల్లూరు జిల్లాలో మహిళలు మండిపడుతున్నారు. లాక్​డౌన్ నిబంధనలు అంటూ నిత్యావసర సరకులకు బయటకు వెళ్లిన వారిపై కేసులు నమోదు చేసే పోలీసులకు... మద్యం దుకాణాల వద్ద గుంపులుగా చేరిన మందుబాబులు కనిపించటం లేదా అని ప్రశ్నించారు.

నిత్యావసర వస్తువులకు రెండు గంటలు మాత్రమే సమయమిచ్చి... మద్యం దుకాణాలకు మాత్రం 7 గంటలు అనుమతినివ్వటం సరైంది కాదంటున్నారు. కరోనా వ్యాప్తికి కారణమవుతున్న మద్యం దుకాణాలను వెంటనే మూసేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details