ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డీసీపల్లి కేంద్రంలో ముగిసిన పొగాకు కొనుగోళ్లు

డీసీ పల్లిని పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లు నిన్నటితో ముగిశాయి. ఈ సంవత్సరం 5.58 మిలియన్ల కేజీల పొగాకు విక్రయించినట్టు అధికారులు తెలిపారు.

By

Published : Jul 27, 2019, 7:13 AM IST

పొగాకు

డీసీపల్లి వేలం కేంద్రంలో ముగిసిన పొగాకు కొనుగోళ్లు

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారంతో పొగాకు కొనుగోళ్లు అధికారికంగా ముగిశాయని వేలం నిర్వహణాధికారి లక్ష్మణరావు తెలిపారు. ఈ ఏడాదికి డీసీ పల్లి వేలం కేంద్రంలో గరిష్ఠ ధర 198 రూపాయలుగాను, కనిష్ఠ ధర 16 రూపాయలుగా నమోదైందని అన్నారు .ఈ ఏడాది అధికారికంగా 5.58 మిలియన్ల కేజీల పొగాకును అమ్మినట్టు ఆయన పేర్కొన్నారు. గతేడాది కంటే ఈ ఏడాదిలో గ్రేడు అధికంగా కొనుగోలు చేశామని వెల్లడించారు. అలాగే రైతులు ప్రకృతి వ్యవసాయంపై ఖర్చులు తగ్గించి ఎక్కువ దిగుబడి నాణ్యత గల పొగాకును పండిస్తే గిట్టుబాటు ధర సాధ్యమవుతుందని సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details