ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నెల్లూరు జిల్లాలో విషాదం..విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి

నెల్లూరు జిల్లాలో గాలివాన ముగ్గురిని బలికొంది. విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించటంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

By

Published : Oct 18, 2020, 7:59 AM IST

Published : Oct 18, 2020, 7:59 AM IST

నెల్లూరులో విద్యుదాఘాతంలో ముగ్గురు మృతి
నెల్లూరులో విద్యుదాఘాతంలో ముగ్గురు మృతి

నెల్లూరులోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు.. విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. శనివారం రాత్రి నగరంలో భారీ వర్షం కురవగా... హౌసింగ్ బోర్డులో నివాసముంటున్న వేణుగోపాల్ ఇంటికి శనివారం రాత్రి కొరియర్ సర్వీస్ బాయ్ వచ్చాడు. అతన్ని ఇంట్లోకి రావద్దని... విద్యుత్ తీగలు పడతాయని చెప్పడానికి ప్రయత్నించి బయటకు వచ్చిన వేణుగోపాల్​పై గాలికి విద్యుత్ తీగలు పడ్డాయి. అతన్ని రక్షించబోయే క్రమంలో అతని తల్లి బుజ్జమ్మ వేణుగోపాల్​ను పట్టుకుంది. ఆరుపులకు బయటకు వచ్చిన అతని భార్య వారిద్దరినీ పట్టుకోగా ముగ్గురు విద్యుదాఘాతానికి గురై మరణించారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ట్రాన్స్​కో సిబ్బందికి తెలిపి విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. ముగ్గురి మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details