ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో ముగ్గురు దొంగల అరెస్టు

నెల్లూరు నగర పరిధిలో ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 6 లక్షల విలువచేసే బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Jul 25, 2019, 6:43 PM IST

దొంగలు అరెస్టు

నెల్లూరులో ముగ్గురు దొంగల అరెస్టు

నెల్లూరు నగరంలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. రెండు స్టేషన్ల పరిధిలో అనేక దొంగతనాలకు పాల్పడ్డారు. వీరి నుంచి 6 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వేదాయపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో శ్రీనివాస రెడ్డి, గవాస్కర్ అనే చైన్ స్నాచర్లను అరెస్టు చేసి 5 లక్షల విలువైన 26 సవర్ల బంగారాన్ని పట్టుకున్నారు. దొంగిలించిన నగలను ఓ ఫైనాన్స్ సంస్థలో తనఖా పెట్టినట్లు డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రవల్లిక అనే దొంగను అరెస్ట్ చేసి, లక్ష రూపాయల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details