ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగన్ ఓటు తొలగించాలి'

రాష్ట్రంలో అక్రమంగా లక్షలాది ఓట్లు తొలగించడానికి వైకాపా కుట్ర పన్ని.. ఏదో గొప్ప పని చేసినట్లు జగన్ తానే చేశామని చెప్పుకుంటున్నారని మంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంతో సంబంధం లేకుండా హైదరాబాద్​ నుంచే అన్ని వ్యవహారాలు నడిపిస్తున్న జగన్ ఓటును ఫారం-7 ద్వారా తొలగించాలన్నారు. అక్రమ మార్గాల ద్వారా కాకుండా దమ్ముంటే పోటీ చేసి గెలవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

By

Published : Mar 8, 2019, 5:12 PM IST

జగన్​పై మంత్రి సోమిరెడ్డి మండిపాటు

మీడియాతో మంత్రి సోమిరెడ్డి

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు 18 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన గురుకుల పాఠశాల భవనంపాలిటెక్నిక్ కళాశాల అదనపు గదులను మంత్రి సోమిరెడ్డి ప్రారంభించారు. అనంతరం మీడియాతో ముచ్చటిస్తూ.. జగన్​పై విరుచుకుపడ్డారు. నకిలీ ఓట్లను తొలగించేందుకు ఎన్నికల సంఘం ఇచ్చిన సదవకాశాన్ని వైకాపా దుర్వినియోగపరుస్తుందని ఆరోపించారు. ఒక్క విశాఖ జిల్లాలోనే 75 వేల ఓట్లను తొలగించేందుకు దరఖాస్తులు చేశారని మండిపడ్డారు. 'జగన్ ఉండేది హైదరాబాద్​లోని లోటస్​పాండ్​లో, పార్టీ కార్యక్రమాలు, వేడుకలు జరుపుకునేది తెలంగాణలో, కేసులు పెట్టేది అక్కడే. ఇలా అన్ని వ్యవహారాలను పక్కరాష్ట్రం నుంచి చేస్తున్న జగన్​కు ఆంధ్రాలో ఓటు ఎందుకు' అని మంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు. ఫారం-7 ద్వారా వైకాపా అధినేత ఓటును మొదట తొలగించాలన్నారు. ఐటీ గ్రిడ్​లో అక్రమంగా ప్రజల సమాచారాన్ని దాచలేదని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన 5 వేల కోట్ల బకాయిల గురించి కేసీఆర్​ను ప్రశ్నించే దమ్ము జగన్​కి లేదని ఎద్దేవా చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details