కడప జిల్లాలో మదర్స్ డే సందర్భంగా స్థానిక పోలీస్ కానిస్టేబుల్ సుందరమ్మను రైల్వే కోడూరు ముస్లిం ఐకాస సభ్యులు ఘనంగా సన్మానించారు. తల్లిగా, చెల్లిగా, భార్యగా ఆమె కుటంబం కోసం చేసిన సేవలు కొనియాడారు.
కరోనా వైరస్ మహమ్మారిని సైతం లెక్కచేయకుండా పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇలాంటి తల్లులను సన్మానించడం, తాము చేసుకున్న అదృష్టమని ముస్లిం ఐకాస సభ్యులు పేర్కొన్నారు.