Amaravati Padayatra:నెల్లూరు జిల్లాలో దాదాపు 3 వారాల పాటు పాదయాత్ర చేసిన రాజధాని రైతులకు.. ఆ జిల్లా వాసులు వెంకటగిరిలో గత రాత్రి ఘనంగా వీడ్కోలు పలికారు. నవంబరు 20వ తేదీన ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరులోకి ప్రవేశించిన మాహాపాదయాత్ర ఇవాళ రాయలసీమలోని చిత్తూరు జిల్లాలోకి అడుగుపెట్టనుంది. నెల్లూరు జిల్లాలో పాదయాత్ర సాగని చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలు పెద్దఎత్తున వెంకటగిరి వచ్చి.. రైతులకు మద్దతు తెలిపారు. తమ ఊరి గ్రామ దేవతను తలపై మోసుకొచ్చి.. రైతుల కోరిక నెరవేరాలని బలంగా ఆకాంక్షించారు. పాఠాశాలల చిన్నారులూ జై అమరావతి అంటూ కేరింతలు కొట్టారు.
AMARAVATI FARMERS: అమరావతి రైతులకు నెల్లూరు వాసుల వీడ్కోలు
amaravati farmers padayatra: నెల్లూరు జిల్లా ప్రజలు అమరావతి రైతులకు.. రాత్రి ఘనంగా వీడ్కోలు పలికారు. 3వారాల పాటు జిల్లాలో పాదయాత్ర చేసిన రైతులు నిన్న రాత్రి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించారు.
అమరావతి రైతులకు చిత్తూరు వాసుల వీడ్కోలు