ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్రానిది  కక్షపూరిత ధోరణి

విభజన హామీల అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో చేపట్టిన దీక్షకు మద్దతుగా నెల్లూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో సంఘీభావ దీక్ష నిర్వహించారు.

By

Published : Feb 11, 2019, 7:43 PM IST

నెల్లూరులో నిరసన

నెల్లూరులో నిరసన
విభజన హామీల అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో చేపట్టిన దీక్షకు మద్దతుగా నెల్లూరులో తెలుగు యువత కార్యకర్తలు సంఘీభావ దీక్ష నిర్వహించారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంపై వివక్షచూపుతోందని ధ్వజమెత్తారు. భాజపాతో కుమ్మక్కైన వైకాపా వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో చంద్రబాబు దీక్షకు మద్దతుకు నిరసనలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details