ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇచ్చిన ప్రతి హమీ నెరవేరుస్తాం  : కాకాని

తమ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఇచ్చిన ప్రతి హమీని నిలబెట్టుకుంటామని నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు కాకాని గోవర్థన్ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు సరైనికావని మండిపడ్డారు.

By

Published : Jul 3, 2019, 6:22 AM IST

నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్థన్

ఎన్నికల మేనిఫేస్టోలో వైకాపా ఇచ్చిన ప్రతి హమీని నెరవేరుస్తామని నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్థన్ స్పష్టం చేశారు. ఇప్పటికే నవరత్నాలపై ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని పేర్కొన్నారు. పేదలకు న్యాయం చేసేదుంకు ఎల్లప్పుడు కృషి చేస్తామన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రభుత్వం లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భద్రత తగ్గించడంపై ఆయన కోర్టును ఆశ్రయించడం సరైందికాదన్నారు.

నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్థన్

ABOUT THE AUTHOR

...view details