ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 7, 2020, 12:02 PM IST

ETV Bharat / state

ఇక పగటిపూటే రైతులకు 9 గంటల విద్యుత్..!

రైతులకు పగటి పూటే 9 గంటల పాటు విద్యుత్​ సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు వెల్లడించారు. దీనికోసం కసరత్తు మొదలు పెట్టినట్లు వివరించారు. జూన్​ నాటికి పనులు పూర్తి చేసి అన్నదాతలకు పూర్తి స్థాయిలో కరెంటు ఇస్తామని తెలిపారు.

day time power supply to farmers
పగటిపూటే రైతులకు 9 గంటల విద్యుత్

పగటిపూటే రైతులకు 9 గంటలు విద్యుత్​ సరఫరా చేస్తామన్న అధికారులు

ఇక నుంచి రైతులకు 9 గంటలు పాటు పగటి పూటే విద్యుత్​ సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కళాధర్ రావు వెల్లడించారు. నెల్లూరు జిల్లా విద్యుత్ భవన్​లో మాట్లాడిన ఆయన.. దీనికోసం ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పగలు, రాత్రి కలిపి 9 గంటల విద్యుత్ రైతులకు సరఫరా చేస్తున్నామన్నారు. పగటి పూటే రైతులకు 9 గంటల విద్యుత్ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జూన్ నాటికి పనులు పూర్తి చేసి, రైతులకు పూర్తి స్థాయిలో కరెంటు ఇస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details