నెల్లూరు జిల్లా గూడూరులో ఆలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా భాజపా కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.
వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత ఆలయాలపై దాడులు పెరిగాయని విమర్శించారు. భాజపా దళితులకు ప్రాధాన్యతం ఇస్తుందని చెప్పారు. తిరుపతి ఉపఎన్నికలో భాజపాకు ప్రజలు మద్దతు పలకాలని కోరారు.