ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 22, 2020, 12:23 PM IST

ETV Bharat / state

హోల్ సేల్ పండ్ల మార్కెట్లలో ఆకస్మిక తనిఖీ

నెల్లూరు నగరంలో హోల్ సేల్ పండ్ల మార్కెట్లను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పండ్లలో రసాయనాలు కలిపితే చర్యలు తప్పవని అధికారులు వ్యాపారులను హెచ్చరించారు.

nellore  district
హోల్ సేల్ పండ్ల మార్కెట్లలో ఆకస్మిక తనిఖి

నెల్లూరు నగరంలోని హోల్ సేల్ పండ్ల మార్కెట్లను కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్, నెల్లూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏసీ ఏసు నాయుడుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పండ్లు మాగేందుకు రసాయనాలు ఉపయోగిస్తున్నారనే సమాచారంతో ఈ తనిఖీలు చేశారు. ఇకమీదట ఇలాంటి చర్యలకు పాల్పడితే వారి వ్యాపార లైసెన్సులు రద్దు చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details