నీరు తాగేందుకు వచ్చిన ఓ జింక పొరపాటున సోమశిల ఉత్తర కాలువలో జారి పడిపోయింది. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం చిలకలమర్రి గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. చుక్కల దుప్పి నీరు తాగేందుకు వచ్చి ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడింది.
అక్కడ నుంచి బయటికి రాలేక ఎగురుతూ ఉండగా.. కొందరు స్థానికులు గమనించి రక్షించేందుకు యత్నించారు. చివరికి.. ఎక్కువ ఎత్తుకు ఎగురుతూ తనకు తానుగానే ఆ జింక బయటపడింది. ఈ దృశ్యాలను అక్కడున్న కొందరు యువకులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు.