YSRCP Government Careless on Urban Health Center : ముఖ్యమంత్రి ఆర్భాటపు ప్రకటనలు ఎలా ఉన్నా. .వాస్తవానికి గ్రామీణులకే కాదు.. పట్టణ ప్రాంత ప్రజలకూ ప్రభుత్వ వైద్య సేవలు (Government Medical Services) సక్రమంగా అందడం లేదు. కొవిడ్ సమయంలో పట్టణ ఆరోగ్య కేంద్రాలకు (Urban Health Center) పంపిన పడకలు, కుర్చీలు, ఫర్నిచర్, వైద్య పరికరాలు ఇప్పటికీ పెట్టెల నుంచి బయటకు తీయకుండా ఉంచారు. వీటిని వినియోగించకుండానే పేదల ముగింటకు వైద్య సేవలు అందుతున్నాయని సాక్షాత్తు సీఎం ప్రకటించడమే విచిత్రంగా ఉంది.
Urban Health Center Situation Under CM Jagan Ruling :పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు ఘోరంగా ఉంది. కొన్నిచోట్ల ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయన్న విషయం స్థానికులకు తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాలతో పాటు పట్టణాలు, నగర ప్రాంతాల్లోనూ ప్రజలు వైద్యం కోసం ఆర్ఎంపీలు, ప్రయివేటు వైద్యుల వద్దకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ ఆరోగ్య కేంద్రాలపై అవగాహన కల్పించకపోవడంతో చాలాచోట్ల సగటున రోజుకు 40 నుంచి 50 వరకు మాత్రమే ఓపీ ఉంటోంది. వాస్తవానికి ఈ కేంద్రాల్లో 64 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉన్నా.. బీపీ, షుగర్, టైఫాయిడ్, మలేరియా, సీపీబీ వంటి పరీక్షలను మాత్రమే పరిమితంగా చేస్తున్నారు. మరోవైపు ఒప్పంద విధానంలో పనిచేస్తున్న వైద్యులు పలు కారణాలతో వెళ్లిపోతుండడంతో ఈ కేంద్రాల్లో అందే వైద్య సేవలపై స్థానికుల్లో విశ్వాసం పెంపొందడంలేదు.
రాష్ట్రంలో బేబీ కిట్ పథకానికి బై బై, ఎందుకు ఆగిందో జగన్కే తెలియాలి?
Health Center in Rented Buildings in Parvathipuram : కొవిడ్ సమయంలోనే (Covid Time) ఈ కేంద్రాలకు అవసరమైన వైద్య పరికరాలు, పరుపులు, మంచాలు, ఇతర ఫర్నిచర్ ప్రభుత్వం పంపిణీ చేసింది. కానీ నాడు-నేడు (Nadu-Nedu) కింద చేపట్టిన నిర్మాణ పనులు కొన్నిచోట్ల నత్తనడకన సాగుతుండడంతో అద్దె భవనాల్లోని ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేసిన పరికరాలు పెట్టెల్లోనే మగ్గుతున్నాయి. పార్వతీపురం పట్టణంలో అద్దె భవనంలో నిర్వహిస్తున్న ఆరోగ్య కేంద్రంలో ఇదే పరిస్థితి.