ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇళ్ల పట్టాల పంపిణీ వేదికపైనే నిద్రపోయిన తహసీల్దార్

ఓ పక్క ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోంది. మరోపక్క అధికారులు, నాయకులు సీఎం జగన్ ప్రసంగాన్ని వీక్షిస్తున్నారు. కానీ ఒక అధికారి మాత్రం వేదికపైనే నిద్రలోకి జారుకున్నారు.

By

Published : Dec 26, 2020, 11:01 AM IST

Published : Dec 26, 2020, 11:01 AM IST

Updated : Dec 26, 2020, 12:30 PM IST

tehsildar-sleep-at-house-rails-distribution-program-in-adhoni
ఆదోనిలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం

ఇళ్ల పట్టాల పంపిణీ వేదికపైనే నిద్రపోయిన తహసీల్దార్
కర్నూలు జిల్లా అదోనిలో ఇళ్ల పట్టాల పంపిణీలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పక్కన కూర్చున్న తహసీల్దార్ రామకృష్ణ నిద్రలో జారుకున్నారు. పట్టాల పంపిణీలో భాగంగా వేదికపైన ఉన్న అధికారులు, నాయకులు సీఎం జగన్ ప్రసంగాన్ని టీవీలో వీక్షిస్తున్నారు. ప్రసంగం ఎక్కువ సేపు ఉండడంతో తహసీల్దార్ నిద్రలోకి జారుకోవడంతో .... అధికారిని చూసి లబ్ధిదారులు ముక్కున వేలేసుకున్నారు. మీడియా ప్రతినిధులు కెమెరాలో బంధించటం చూసి పురపాలక కమిషనర్ కృష్ణ తహసీల్దార్ రామకృష్ణను అప్రమత్తం చేశారు.

ఇదీ చదవండి:

Last Updated : Dec 26, 2020, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details