ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Somireddy: కృష్ణాబోర్డు, ఎన్టీటీకి సంబంధం లేకుండా రాయలసీమ లిప్టు ఎలా నిర్మిస్తారు..?

ఎన్జీటీ ఆదేశాల మేరకు కృష్ణా బోర్డు బృందాన్ని.. రాయలసీమ ఎత్తిపోతల సందర్శనకు అనుమతించాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. కృష్ణాబోర్డు, ఎన్టీటీకి సంబంధం లేకుండా రాయలసీమ లిప్టును ఎలా నిర్మిస్తారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.

By

Published : Jul 23, 2021, 5:29 PM IST

tdp leader somireddy chandramohan reddy fires on govt over water projects
కృష్ణా జలాలు, రాయలసీమ ప్రాజెక్టులపై తెదేపా నేతల సమావేశం

రాయలసీమలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న మాజీమమంత్రి సోమిరెడ్డి

జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(NGT) ఆదేశాల మేరకు.. కృష్ణా బోర్డు బృందాన్ని రాయలసీమ ఎత్తిపోతల సందర్శనకు అనుమతించాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. 'కృష్ణా జలాలపై కేంద్రం పెత్తనం-రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్తుపై సమాలోచన' అనే అంశంపై.. కర్నూలులో జరిగిన సమావేశానికి పలువురు నేతలు హాజరయ్యారు. కృష్ణాబోర్డు, ఎన్టీటీకి సంబంధం లేకుండా రాయలసీమ లిప్టును ఎలా నిర్మిస్తారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. త్వరలోనే శ్రీశైలం ప్రాజెక్టు సహా 8 పార్లమెంటు కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి.. తిరుపతిలో రైతు సభ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, గాలేరు- నగరి, హంద్రీనీవా తదితర ప్రాజెక్టుల సామర్థ్యం పెంచాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details