ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అహోబిల మఠం సాధారణ కార్యకలాపాలతో.. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం: సుప్రీం

By

Published : Jan 27, 2023, 12:34 PM IST

Updated : Jan 27, 2023, 1:11 PM IST

sc
sc

12:28 January 27

మఠం సాధారణ కార్యకలాపాలతో ప్రభుత్వానికి సంబంధం ఏంటన్న కోర్టు

SC ON AHOBILA : అహోబిలం మఠం ఈవో నియామకం విషయంలో.. సుప్రీంకోర్టులోనూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అహోబిలం మఠానికి ఈవో.. నియామకాన్ని తప్పుపడుతూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. మఠం సాధారణ కార్యకలాపాలతో.. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధమని నిలదీసింది. ఎందుకు మఠం చేజిక్కించుకోవాలనుకుంటున్నారని ప్రశ్నించింది. ఆలయాలు, ధార్మిక క్షేత్రాలను ధర్మకర్తలకే వదిలేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇందులో ప్రభుత్వ జోక్యం అవసరం లేదని తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీంకోర్టు ధర్మాసనం...ఈ ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ఇవీ చదవండి:

Last Updated : Jan 27, 2023, 1:11 PM IST

ABOUT THE AUTHOR

...view details