ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలెక్టరేట్​ సిబ్బందికి కరోనా..ఇతరులను అనుమతించని అధికారులు

కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోకి వివిధ పనుల కోసం వచ్చే వారిని పోలీసులు లోపలకు అనుమతించడం లేదు. అక్కడ పని చేసే ఉద్యోగులకు కరోనా సోకటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఉద్యోగులను మాత్రమే లోపలకు అనుమతిస్తున్నారు.

By

Published : Jun 27, 2020, 4:10 PM IST

no entry to kurnool collector office
కర్నూలు కలెక్టర్ కార్యాలయం

కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులకు కరోనా సోకింది. పోలీసులు ప్రధాన గేట్లు మూసివేశారు.కార్యాలయం లోపలికి ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తున్నారు. పనుల కోసం వచ్చేవారిని లోపలకు పంపించడం లేదు. భద్రతా కారణాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details