ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెత్తతో కూర్చీలు, సోఫా... దానమిచ్చేస్తారు

మనం చెత్తను సేకరించి సేంద్రియ ఎరువులను, రకరకాల వస్తువులను తయారు చేస్తున్నాం. వీరు మరో అడుగు ముందుకు వేసి బల్లలు, కుర్చీలు, మంచాలు, సోఫా సెట్లు తయారు చేస్తున్నారు... ఇవే కాకుండా విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్సిలు తయారు చేసి... వారికే బహుమతిగా ఇస్తున్నారు.

By

Published : Jun 27, 2019, 8:57 AM IST

చెత్తేను కూర్చీలు, సోఫాగా మార్చేస్తారు... దానమిచ్చేస్తారు

చెత్తను ఉపయోగించి వివిధ రకాల వస్తువులు తయారుచేసి అందర్నీ ఆకర్షిస్తుందీ.....ఓ స్వచ్ఛంద సంస్థ . దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో దిల్లీ, బెంగళూరు కేంద్రంగా చెత్తను సేకరించి పుస్తకాలు, పెన్సిళ్లు, బల్లలు, కుర్చీలు, మంచాలు, సోఫా సెట్లు తయారుచేస్తున్నారు. వాటిని ప్రభుత్వ పాఠశాలలకు విరాళంగా అందిస్తున్నారు. అలాగే కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం దామగట్లలోని ప్రత్యేక ప్రాథమిక పాఠశాలకు బల్లలు, కుర్చీలు, పుస్తకాలను ఎమ్మెల్యే ఆర్థర్ చేతులమీదుగా అందజేశారు. ఇంతకుముందు అనంతపురం, కడప జిల్లాల్లోని ప్రత్యేక పాఠశాలలకు వస్తువులను అందజేసినట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు.

చెత్తేను కూర్చీలు, సోఫాగా మార్చేస్తారు... దానమిచ్చేస్తారు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details