తెలంగాణలోని హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద తృటిలో పెను ప్రమాదం తప్పింది. మలక్పేట నుంచి వస్తున్న ఎంఎంటీఎస్ రైలు, స్టేషన్లో ఆగివున్న కర్నూలు ఇంటర్ సిటీఎక్స్ప్రెస్(హంద్రీ ఎక్స్ప్రెస్)ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా, కిమ్స్ ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ చంద్రశేఖర్ క్యాబిన్లో చిక్కుకున్నాడు. అతన్ని బయటకు తీసేందుకు నాలుగు గంటలుగా ఎన్డీఆర్ఎప్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గ్యాస్ కట్టర్తో కేబిన్ను కత్తిరిస్తున్నారు. లోకోపైలెట్కు ప్రాణాపాయం కలగకుండా వైద్యులు ఆక్సిజన్, సెలైన్ అందిస్తున్నారు. ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ లోకోపైలెట్ రక్తనమూనాలనూ వైద్యాధికారులు సేకరించారు.
మానవ తప్పిదమే