ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా పథకాలే.. తెలంగాణలో!

కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని తోగార్చేడు, మద్దూరు గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంత్రి ఎన్ఎండీ ఫరూక్, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి శంకుస్థాపన చేశారు.

By

Published : Mar 3, 2019, 9:40 PM IST

కర్నూలు జిల్లా

పాణ్యం మండలంలో మంత్రి ఫరూక్ పర్యటన
గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ చెప్పారు. వైకాపా అధికారంలోకి వస్తే కక్షలు పెరగడం తప్ప రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నారు. కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని తోగార్చేడు, మద్దూరు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 15 లక్షలతో షాదీఖానా నిర్మాణాన్ని ప్రారంభించారు. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పెద్ద కుటుంబాలను చంద్రబాబు ఏకం చేస్తున్నారని తెలిపారు. తెదేపా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే తెలంగాణ సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 93 లక్షల మంది డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు, పసుపుకుంకుమ కింద ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details