మహానంది గోశాల సమీపంలో చిరుత సంచారం
కర్నూలు జిల్లా మహానంది గోశాల సమీపంలో చిరుత సంచరిస్తోంది. లాక్డౌన్ కారణంగా జనసంచారం లేకపోవడంతో వన్యప్రాణుల సంచారం పెరిగింది.
మహానంది గోశాల సమీపంలో చిరుత సంచారం
కర్నూలు జిల్లా మహానంది గోశాల సమీపంలో చిరుత సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. గోశాల సమీపంలో పందిపిల్లపై చిరుత దాడి చేసి చెట్టుపైకి తీసుకెళ్లింది. చెట్టు పైనుంచి పందిపిల్ల కిందపడటంతో చిరుత కూడా కిందకు దూకింది. అక్కడే ఉన్న మిగిలిన పందులు ఎదురుతిరగటంతో చిరుత అడవిలోకి పారిపోయింది.