ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 26, 2020, 10:29 PM IST

ETV Bharat / state

కర్నూలులో 8 చోట్ల రైతు బజార్లు : కలెక్టర్ వీరపాండియన్

కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలందరూ ఇళ్ల వద్దే ఉండి సహకరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కోరారు. కర్నూలులోని రైతు బజార్లను వికేంద్రీకరించి 8 ప్రదేశాల్లో మార్కెట్లు ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. లాక్​డౌన్ పూర్తిస్థాయి అమలుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని ఎస్పీ ఫకీరప్ప

కలెక్టర్ వీరపాండియన్
కలెక్టర్ వీరపాండియన్

నంద్యాలలో కలెక్టర్ వీరపాండియన్ పర్యటన

కరోనా వైరస్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని.. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని కర్నూలు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాలలో జిల్లా ఎస్పీ ఫకీరప్పతో కలిసి ఆయన పర్యటించారు. పట్టణంలో కూరగాయల మార్కెట్ల వికేంద్రీకరణలో భాగంగా 8 ప్రదేశాల్లో మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నిత్యవసరాల సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. మధ్యాహ్నం 1 తర్వాత ఆస్పత్రులు, మందుల దుకాణాలు మాత్రమే తెరిచి ఉంటాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే వారికి పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. లాక్​డౌన్ క్రమంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉందని ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details