కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కోట్ల దంపతులు రాజీనామా చేశారు.మార్చి 2న తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ అధిష్టానంకనీసం తమ అభిప్రాయాలు తీసుకోలేదని వాపోయారు. తెలంగాణ ఎన్నికల్లో పొత్తు విషయం గురించి చర్చించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అవలంభించే విధానాలు నచ్చకే పార్టీ వీడుతున్నామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు ప్రాజెక్టులపై విడుదల చేసిన జీవోలకు విశ్వసనీయత ఉందన్నారు. వాటిపై వచ్చే విమర్శలను ఖండించారు.