ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏటీఎం చోరీకి హర్యానా దొంగల యత్నం.. పోలీసులపై కాల్పులు

By

Published : Dec 15, 2022, 4:47 PM IST

ATM thieves arrested: సినిమా తరహాలో హర్యానాకు చెందిన ఓ ముఠా దొంగతనానికి ప్లాన్​ చేసింది. దీనికోసం ఒక పెద్ద కంటైనర్​ని సిద్దం చేసుకున్నారు. ఏటీఎం కోసేందుకు యత్నించారు. పోలీసులు రావడంతో తప్పించుకునేందుకు దారులు వెతికారు. తమను అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై కాల్పులు జరిపారు. కర్నూలు నగరంలోని బాలాజీ నగర్​లో ఇదంతా జరిగింది.

gang of thieves
దొంగల ముఠా అరెస్ట్

ATM Thieves Arrested: హర్యానాకు చెందిన దొంగల ముఠా కర్నూలు నగరంలోని బాలాజీ నగర్​లో ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశారు. రాత్రి సమయంలో ఐదుగురు దుండగులు కంటైనర్​లో కర్నూలుకు వచ్చి బాలాజీ నగర్ వద్ద జాతీయ రహదారిలో వాహనాన్ని నిలిపి.. సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంలోకి ఒక దొంగ చొరబడి రంపంతో ఏటీఎం కోసే యత్నం చేస్తుండగా.. మిగిలిన వారు బయట ఉన్నారు. అప్పుడే గస్తీ కోసం అటువైపునకు వచ్చిన పోలీసులు.. ఏటీఎం బయట ఉన్న వ్యక్తిని చూసి అనుమానంతో వారి వద్దకు వెళ్లారు. దుండగులు అప్రమత్తమై వేర్వేరు మార్గాల్లో తప్పించుకొని పారిపోయారు. ముగ్గురు కంటైనర్​లోకి ఎక్కి ఉడాయించగా పోలీసులు చాకచక్యంగా వారిని వెంబడించి పట్టుకున్నారు. ఈ క్రమంలో దుండగులు పోలీసులపై కాల్పులకు పాల్పడినట్లు సమాచారం. అయినా పోలీసులు ధైర్యంగా వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details