ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్నేహితులతో కలిసి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

ఐదుగురు స్నేహితులు కలిసి ఓ పని కోసం కారులో బయలు దేరారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సాగుతున్న వారి ప్రయాణంలో ప్రమాదం జరిగింది. బృందంలోని ఒకరు మృతి చెందడం.. అంతులేని విషాదాన్ని నింపింది.

By

Published : May 18, 2019, 5:01 PM IST

ప్రమాదంలో దెబ్బతిన్న కారు

ఉసురు తీసిన ప్రయాణం

కర్నూలు నగర శివార్లలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు... తుంగభద్ర నది సమీపంలో ట్రాక్టర్​ను ఢీ కొంది. ఈఘటనలో కారులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.... చికిత్స పొందుతూ సమీర్ కుమార్ అనే వ్యక్తి మృతిచెందాడు. సాగర్, రాజేష్, రఘనందన్, ప్రశాంత్ అనే మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా బెంగళూరు వాసులుగా పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details