ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అగ్నిమాపక శాఖ కార్యాలయంలో అనిశా దాడులు

By

Published : Sep 27, 2020, 9:30 AM IST

అగ్ని మాపక శాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న అధికారిని అనిశా అధికారులు పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

acb raids on kurnool fire station
అగ్ని మాపక శాఖ కార్యాలయంలో అనిశా అధికారులు దాడులు

కర్నూలు అగ్ని మాపక శాఖ కార్యాలయంలో అనిశా అధికారులు దాడులు చేశారు. ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఎన్​ఓసీ ఇవ్వడానికి ఫైర్​ స్టేషన్​ అధికారి నాగరాజు నాయక్​ డబ్బులను డిమాండ్​ చేశారు. బాధితుడి నుంచి రూ.1.20 లక్షల నగదును తీసుకుంటుండగా అధికారి నాగరాజు, కానిస్టేబుల్​ అనిల్​ను పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details