ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్ డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: విజయవాడ సీపీ

లాక్ డౌన్ ఎలా అమలవుతోందన్నది పరిశీలించారు విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు. భౌతిక దూరం పాటిస్తేనే కరోనాను నివారించవచ్చని చెప్పారు.

By

Published : Apr 7, 2020, 4:53 PM IST

vijayawada Cp comments On Red Zone Security
విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు

విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు

విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు.. కృష్ణా జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించారు. లాక్ డౌన్ పరిస్థితులను తెలుసుకోవటంతో పాటు...టోల్ గేట్​ల వద్ద భద్రతా ఏర్పాట్లును పరిశీలించారు. ఉయ్యూరులో పర్యటించిన సీపీ.. మున్సిపల్, పోలీస్, మీడియా వారు ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొలుసు పార్థసారథితో కలసి పాల్గొన్నారు. ఉంగుటూరు మండల పరిధిలోని పొట్టిపాడు టోల్ గేట్​ని సందర్శించారు. అక్కడ లాక్ డౌన్ అమలు తీరు గురించి, భద్రతా ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details