ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుటుంబ కలహాలతో ఇద్దరు ఆత్మహత్యాయత్నం

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు యత్నించారు. వీరికి నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు ఘటనలకు కారణం కుటుంబ కలహాలేనని తెలుస్తోంది.

By

Published : Aug 15, 2019, 8:17 AM IST

ఆసుపత్రి

కుటుంబ కలహాలతో ఇద్దరు ఆత్మహత్యాయత్నం

కుటుంబ కలహాలతో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో ఒకరు సురక్షితంగా ఉండగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రెండు ఘటనలు కృష్ణా జిల్లాలో చోటుచేసుకున్నాయి. నూజివీడు మండలం ముక్కెళ్లపాడు గ్రామానికి చెందిన కోటేశ్వరావు ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించారు. మరో ఘటనలో ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామానికి చెందిన రాధాకృష్ణ గుళికలు తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరువురు నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యస్థితి మెరుగైందని ఆసుపత్రి వైద్యుడు వరప్రసాదరావు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details