ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతర్జాతీయ యోగాలో మెరిసిన నూజివీడు విద్యార్థులు

శ్రీలంకలో జరిగిన ఇంటర్​నేషనల్ ఒలంపిక్ యోగ పోటీల్లో నూజివీడుకు చెందిన ముగ్గురు విద్యార్ధులు బంగారు పతకాలు సాధించారు.

By

Published : Sep 22, 2019, 12:08 PM IST

అంతర్జాతీయ యోగాలో బంగారు పతకాలు సాధించిన నూజివీడు విద్యార్థులు

అంతర్జాతీయ యోగాలో బంగారు పతకాలు సాధించిన నూజివీడు విద్యార్థులు

శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ స్టూడెంట్ ఒలంపిక్ యోగాలో కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన ముగ్గురు విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు.అండర్-22బాలికల విభాగంలో తల్లాప్రగడ సాయి ప్రసన్న లక్ష్మి,అండర్-22బాలుర విభాగంలో శ్రీకాంత్,అండర్-8విభాగంలో ఎం.జనార్థన రాజారామచంద్ర చార్యులు ప్రథమ స్థానంలో నిలిచారు.ఈ నెల15,16,17వ తేదీల్లో శ్రీలంక రాజధాని కొలంబోలో ఈ పోటీలు జరిగాయి.తన తల్లిదండ్రుల ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించానని,వారి స్పూర్తితోనే శిక్షణ సంస్థను ఏర్పాటు చేశానని ప్రసన్న లక్ష్మి తెలిపారు.ప్రసన్న లక్ష్మి ఆధ్వర్యంలో యోగా మెళకువలు నేర్చుని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నామని శ్రీకాంత్,జనార్థన్ పేర్కొన్నారు..

ABOUT THE AUTHOR

...view details