ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 21, 2020, 11:22 AM IST

ETV Bharat / state

'మండలిని రద్దు చేస్తామని చెప్పి.. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామంటారా?'

తిరుపతి ఉపఎన్నికలో దుర్గాప్రసాద్ కుటుంబానికి ఉప ఎన్నిక టిక్కెట్ ఇవ్వకపోవటంపై తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో వైకాపా నేతలకు ఉన్న వ్యతిరేకతపై దృష్టి మరల్చటానికి హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు.

TDP spokesperson Divyavani is angry over the YCP government's attitude
తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి

తిరుపతి ఉప ఎన్నికలో బల్లి దుర్గాప్రసాద్ కుమారుడికి టిక్కెట్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్... ఎమ్మెల్సీ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వైకాపా నేతలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దృష్టిని మళ్లించేందుకే హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ఎమ్మెల్యే రోజా వ్యవహార శైలిని తప్పుబట్టారు.

ABOUT THE AUTHOR

...view details