కృష్ణాజిల్లా మూలపాడుకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి అర్ధరాత్రి ఇంటి మెట్లెక్కుతూ జారి.. ఇనుపసువ్వలపై పడ్డాడు. ఈ ఘటనలో ఇనుపసువ్వ మెడ భాగం నుంచి చెవిలోకి దూసుకెళ్లింది. అర్థరాత్రి సమయంలో బాధితుణ్ని పలు ఆసుపత్రులకు తీసుకెళ్లినా పట్టించుకోలేదు. సన్ రైజ్ ఆసుపత్రి సిబ్బంది వెంటనే చికిత్స అందించారు. వివిధ పరీక్షలు చేసి లాప్రోస్కోపి ద్వారా చికిత్స చేయాలని నిర్ణయించారు.
ఈఎన్టీ వైద్యులు డా. నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం నాలుగు గంటలు శ్రమించి ఇనుప చవ్వను తీశారు. అయితే మెదడుకు సంబంధించిన నరం పక్క నుంచి చువ్వ వెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. బాధితుడి స్వరపేటిక దెబ్బతిందని... ఓ కంటికి పక్షవాతం వచ్చిందని వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రామకృష్ణను వైద్య బృందం శ్రమించటంతో రక్షించకలిగామన్నారు.