ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ సర్వర్ సమస్య... గంటలపాటు నిలిచిన బస్సులు....

కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో ఆర్టీసీ బస్సులకు సర్వర్ పనిచేయకపోవటం వలన ఏడు గంటల వరకు బస్సులు బయలుదేరలేదు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. .

By

Published : Aug 27, 2019, 3:09 PM IST

ఆర్టీసీ బస్సు సర్వర్ ప్రాబ్లమ్

ఆర్టీసీ బస్సు సర్వర్ సమస్య దీంతో ప్రయాణీకులకు ఇబ్బందులు

కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో ఏపీఎస్ ఆర్టీసీలో సర్వర్ మొరాయింపుతో ఆర్టీసీ డిపో నుంచి ఒక బస్సు బయటకు రాలేని దుస్థితి నెలకొంది. నిత్యం ప్రయాణాలు చేసే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆర్టీసీ డిపోలో సిబ్బంది సర్వర్​తో కుస్తీ పడుతూనే ఉన్నారు. ఉదయం 7 గంటల వరకు ఒక బస్సు బయటకు తీయలేని పరిస్థితిలో ఆర్టీసీ డిపోలో నెలకొంది. అధికారులు విజయవాడలోనే ఉన్నతాధికారులతో సాంకేతిక సలహా సంప్రదింపులు జరిపి సమస్యలను పరిష్కరించారు.

ABOUT THE AUTHOR

...view details