లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం... వ్యక్తి మృతి
రెండు వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కృష్ణాజిల్లాలోని గన్నవరం సమీపంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం... వ్యక్తి మృతి
కృష్ణాజిల్లా గన్నవరంలోని సమీపంలోని నిడమానురు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం వెళ్తున్న లారీని.. ద్విచక్రవాహనం వెనకనుంచి వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో సునీల్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్రవాహనంపై కూర్చున్న మరో యువకుడికి గాయాలయ్యాయి. పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.