ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

2 ద్విచక్రవాహనాలు ఢీ.. తెలంగాణకు చెందిన నలుగురికి గాయాలు

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని నలుగురికి గాయాలైన ఘటన కృష్ణా జిల్లా తోటచెర్ల వద్ద జరిగింది.

By

Published : Sep 24, 2020, 11:24 AM IST

road accident in thotacherla krishna distirct
ప్రమాదంలో గాయపడిన వ్యక్తులు

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచెర్ల వద్ద జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురం గ్రామానికి చెందిన ఇద్దరు, సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని 108 వాహనంలో నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒక మహిళ ఉంది.

ABOUT THE AUTHOR

...view details