ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. తండ్రి, కుమార్తె మృతి

By

Published : Mar 30, 2021, 8:07 AM IST

Updated : Mar 30, 2021, 7:35 PM IST

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి.

road accident in krishna district
road accident in krishna district

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. తండ్రి, కుమార్తె మృతి

కృష్ణా జిల్లా 65వ నంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కృష్ణాజిల్లా వత్సవాయి మండలం భీమవరం సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుకనుంచి వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొంది. ప్రమాదంలో అక్కడికక్కడే తండ్రి, కుమార్తె మృతి చెందారు. భార్య, మరో కుమార్తెకు తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బైక్‌పై దంపతులతో పాటు ఇద్దరు కుమార్తెలు ప్రయాణిస్తున్నారు. బాధితులు నాగాయలంక మండలం తలగడదీవి గ్రామానికి చెందిన దోమ సుకుమార్, రాధికగా గుర్తించారు. వీరు హైదరాబాద్​లోని కుషాయిగూడ ప్రాంతంలో వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం బంధువుల శుభకార్యం నిమిత్తం స్వగ్రామానికి వచ్చారు. తిరిగి ద్విచక్రవాహనంపై హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తండ్రి దోమ సుకుమార్, చిన్న కుమార్తె ఐశ్వర్య మృతి చెందారు.

Last Updated : Mar 30, 2021, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details