కృష్ణా జిల్లా నూజివీడులోని వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న.. గిఫర్డ్ మెమోరియల్(అమెరికన్) ఆసుపత్రిలో కంటికి అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. కట్టు, కుట్టు అవసరం లేకుండా అత్యాధునికి సాంకేతిక నైపుణ్యంతో శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు వెల్లడించారు.
కేవలం 1.8 మిల్లీమీటర్ల రంధ్రంతో శుక్లాన్ని.. మత్తు ఇంజక్షన్ లేకుండా ట్రాపికల్ అనస్తీషియా ద్వారా ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. ట్రాపికల్ అనస్తీషియాతో ఫ్యాకో టిప్ అల్ట్రా సౌండ్ తరంగాలు ప్రభావం చూపించి.. శుక్లాన్ని తొలగిస్తాయని వివరించారు. అనంతరం పోల్డర్ ఐఓఎల్ ద్వారా చికిత్సతో రోగి త్వరగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు.