ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా.. రైతులకు న్యాయం జరిగేలా చూస్తా'

By

Published : Dec 2, 2020, 12:20 PM IST

Updated : Dec 2, 2020, 1:15 PM IST

నివర్ తుపాను కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు... జనసేనాని పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. రైతులతో మాట్లాడి నష్టపోయిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్నదాతలు పవన్ ముందు కంటతడి పెట్టగా... నష్టపరిహారం వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు.

'ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా.. రైతులకు న్యాయం జరిగేలా చూస్తా'
'ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా.. రైతులకు న్యాయం జరిగేలా చూస్తా'

జనసేనాని పర్యటన ప్రారంభం... నష్టపరిహారం చేకూరేలా కృషి చేస్తానని హామి

కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటిస్తున్నారు. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. వర్షాలకు నష్టపోయిన పంటలను పవన్‌కల్యాణ్‌కు చూపిస్తూ రైతులు కంటతడి పెట్టారు. తుపానుతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని ఆయన వాపోయారు. అన్నం పెట్టే రైతు కన్నీరు కారుస్తున్నారని... రైతన్నకు భరోసా ఇచ్చేందుకే వచ్చానని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని... ఆర్థిక సాయం వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అభిమానుల కోలాహలం

జనసేనాని పర్యటన ప్రారంభం... నష్టపరిహారం చేకూరేలా కృషి చేస్తానని హామి

పవన్​ను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావటంతో ఉప్పలూరు, పునాదిపాడుల మధ్య ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లాలో పవన్ పర్యటన... అభిమానుల సందడి

Last Updated : Dec 2, 2020, 1:15 PM IST

ABOUT THE AUTHOR

...view details