ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 28, 2021, 10:52 PM IST

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి .. మరొకరికి తీవ్ర గాయాలు

కృష్ణా జిల్లా గుర్రాజుపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న లారీని క్రాస్ చేసే క్రమంలో కారు.. వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.

men died in raod accidnet
men died in raod accidnet

కృష్ణాజిల్లా జి.కొండూరు మండలంలోని గుర్రాజుపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. జి.కొండూరు మండలం గడ్డమణుగుకు చెందిన కాటూరు ప్రవీణ్, కొర్లపాటి చక్రి అనే యువకుడితో కలిసి ద్విచక్రవాహనంపై మైలవరం వెళుతున్నారు. లారీని క్రాస్ చేసే సమయంలో ఎదురుగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని మైలవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details