ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 16, 2021, 2:08 PM IST

ETV Bharat / state

NREGS Payments : ఉపాధి కూలీల వేతనాల చెల్లింపులో జాప్యం ఎందుకు ?

రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ఉపాధి హామీ చట్టం నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఆరోపించింది. పనులు చేసిన కూలీలకు వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోందని... నెలల తరబడి కోట్ల రూపాయల బకాయిలు ఉంటున్న పరిస్థితి ఇన్నేళ్ల కాలంలో ఎప్పడూ లేదని పేర్కొంది. ఈ అంశంపై వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లుతో 'ఈటీవీ భారత్' ముఖాముఖి...

ఉపాధి కూలీల వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం ఎందుకు ?
ఉపాధి కూలీల వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం ఎందుకు ?

రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ఉపాధి హామీ చట్టం నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఆరోపించింది. పనులు చేసిన కూలీలకు వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోందని... నెలల తరబడి కోట్ల రూపాయల బకాయిలు ఉంటున్న పరిస్థితి ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడూ లేదని పేర్కొంది. న్యాయస్థానాలు ఆదేశిస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా కాలంలో ఉపాధి అవకాశాలు లేక కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపింది. సామాన్యుల నుంచి ఉన్నత చదువులు చదివిన వారు సైతం ఉపాధి హామీ పనుల కోసం ముందుకొస్తున్నా వారికి భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం లేదని ఆరోపించింది. ఈ అంశంపై వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లుతో 'ఈటీవీ భారత్' ముఖాముఖి...

ఉపాధి కూలీల వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం ఎందుకు ?

ABOUT THE AUTHOR

...view details